ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశానికే దిక్సూచిగా…. తెలంగాణ వైద్య, ఆరోగ్యం నిలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం ఇది. ఒకే సారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం.. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
