ప్రాంతీయం

సర్పంచ్ దంపతులు సన్మానించిన పద్మశాలి మహిళలు

129 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి మమత దంపతులను స్థానిక పద్మశాలి సంఘం మహిళలు మార్కండేయ ఆలయంలో సోమవారం రోజు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లి ఇటీవల ఢిల్లీలో జాతీయ ఉత్తమ సేవా పథకం అందినందుకు చాలా గర్వకారణం అని అన్నారు. ఈ అవార్డు మన ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కి రావడం పట్ల  మా పద్మశాలి మహిళా సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఈ దంపతులకు సన్మానించడం జరిగిందని వారు అన్నారు. అలాగే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అవార్డులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *