ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మార్చి 4, గుండారంలో పోడు భూముల లబ్ధి దారులకు పట్టాలు ఇప్పించండి రేవంత్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందించిన గిరిజనులు.
అనేక ఏళ్లుగా పొడు భూమిలో సేద్యం చేసుకుంటున్న తమకు భూమి పట్టాలు ఇప్పించాలని కోరుతూ మండలంలోని గుండారం గ్రామ గిరిజనులు
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించారు. పోడుభూమి లబ్ధిదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క పరిష్కారం చూపాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో గల పోడుభూమిలో అనేక ఏళ్లుగా తమ తాతల్నాటి నుండి పోడు వ్యవసాయం చేసుకుంటూ భూమిని దున్నుకున్నామని, అట్టి భూములను ఫారెస్ట్ అధికారుల తమదని స్వాధీనం చేసుకొని భూముల్లోకి రాకుండా అడ్డు కుంటున్ననట్లు గిరిజనులు రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం ఆ భూమిలోఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారని, తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని గిరిజనులు రేవంత్ రెడ్డినీ కోరారు. గిరిజన రైతుల వెంట పోడు భూమి కమిటీ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ రాజు నాయక్ వున్నారు.
243 Viewsముస్తాబాద్ ప్రతినిధి మంత్రివర్యులు కేటీఆర్ పర్యటనలో భాగంగా బిజీగా ఉండటం వలన తాను రాలేని పక్షాన ప్రారంభోత్సవాలు ఆగకూడదని మన పార్టీ నాయకులు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు మేరకు పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కలిసి మండలంలోని పలు గ్రామాలలో ప్రారంభోత్సవాలు జరిపించారు. మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడున్నా ప్రజల కోసమే పనులు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలకు రావడం వీలుకాక పార్టీ శ్రేణులను బిఆర్ఎస్ కార్యకర్తలను ముందుంచి పనులు […]
109 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 45 ) అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం 2గంటలకు చేపలు పట్టేందుకు తోటి కులస్తులతో సహా నర్మాల ఎగువ మానేరు డ్యామ్ లోకి వెళ్లారు అందరు యధావిధిగా సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి తోటి మత్స్యకారులు చేరుకోగా కొత్తపల్లి దేవయ్య ఇంటికి రాకపోవడం తో అతని భార్య బాలమణి శుక్రవారం ఉదయం […]
194 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 20, నేరెళ్ళ గ్రామ సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు. తంగల్లపల్లి మండలం నేరెల్ల గ్రామ సమీపంలో వేకువ జామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో కార్లోని ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడం కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పినట్లు సమాచారం. కాగా జగిత్యాల జిల్లాకు చెందిన కారు హైద్రాబాద్ నుండి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఘటనకు సంబంధించిన […]