ముస్తాబాద్ ప్రతినిధి మంత్రివర్యులు కేటీఆర్ పర్యటనలో భాగంగా బిజీగా ఉండటం వలన తాను రాలేని పక్షాన ప్రారంభోత్సవాలు ఆగకూడదని మన పార్టీ నాయకులు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు మేరకు పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కలిసి మండలంలోని పలు గ్రామాలలో ప్రారంభోత్సవాలు జరిపించారు. మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడున్నా ప్రజల కోసమే పనులు చేస్తున్నారు.
అన్ని కార్యక్రమాలకు రావడం వీలుకాక పార్టీ శ్రేణులను బిఆర్ఎస్ కార్యకర్తలను ముందుంచి పనులు నడిపిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కెసిఆర్, కేటీఆర్ కి ప్రజా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అందులో భాగంగానే నిన్నటి రోజున వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామినీ దర్శించుకొని మంత్రి కేటీఆర్ మల్లీ సిరిసిల్లకు అధిక మెజారిటీతో గెలవాలని తలనీలాలు మొక్కు చెల్లించడం జరిగిందని.బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నరేంద్ర చారి మనస్ఫూర్తిగా తెలిపారు.




