సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి వినతులు ఆయా శాఖల అధికారులు అర్జి దారులు మళ్లీ అర్జి పెట్టుకోకుండా సత్వరమే పరిష్కరించి న్యాయం చేయ్యాలన్నారు. భూ సంబంధిత, రెండు పడక గదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర మొత్తం దరఖాస్తులు 106 స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.