దౌల్తాబాద్: దుబ్బాక అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. మండలంలోని గువ్వలేగి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ గారి చొరవతో, మంత్రి హరీష్ రావు గారి సహకారంతో దుబ్బాక ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ లతా మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యులు రహీం, ఉప సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు…
