మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపే కాయంగా చేస్తాం
గజ్వేల్ మే 11
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కర్కపట్ల 303 బూతులో మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ని అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి పథకం గురించి వివరించడం జరిగింది
కరోనా కష్టకాలంలో ఉచితంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసినందుకు మోడీ కి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నామని గ్రామ ప్రజలు తెలియజేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందిప్రతి గడపగడపకు తిరుగుతున్నప్పుడు వెంకట్రాంరెడ్డి చేసిన అన్యాయాలు అరాచకాలు ఆకృత్యాలు స్వయంగా ప్రజలే చెపుతుంటే రఘునందన్ రావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలుస్తుంది.
ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు జి.నర్సింలు, మండలం బీజేవైఎం అధ్యక్షులు పంజా మధుయాదవ్, మండల కోశాధికారి పాలే మహేందర్ , మరియు కార్యకర్తలు నాగరాజు, కంచుగాంట్ల మహేందర్, వేణు, మున్ని, ఉడుత మహేష్, గజే నరేష్, తదితరులు పాల్గొన్నారు.
