ముస్తాబాద్/ అక్టోబర్/10; ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న బోజన కార్మిక సంఘం హైదరబాద్ లో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. నెల నెల వంట బిల్లులు మంజూరు చేయాలని , అలాగే వారి ఇతర డిమాండ్లు వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు అని తెలిపారు. ఈకార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబయమ్మ, ఉపాధ్యక్షురాలు ,గొట్టే సంతోష (ముస్తబాద్) మంజుల తదితరులు పాల్గొన్నారు.
