24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7)
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ సూచించారు. పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ కార్యకర్తలను అండగా నిలవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర రావు,జక్కుల రజిత – శ్రీనివాస్, సిరంగి సునీల్,ఆవాల రాధిక రెడ్డి, జన్ను శిభా రాణి – అనిల్, గుగులోత్ దివ్య రాణి – రాజు నాయక్, మునిగల సరోజన – కరుణాకర్, గుగులోత్ రవి నాయక్,ఈదురు అరుణ – విక్టర్, తూర్పటి సులోచన -సారయ్య, రైతు బందు కో ఆర్డినేటర్ కంకణల సంపత్ రెడ్డి, మార్కెట్ డైరక్టర్ గనిపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.
