రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా డి ఎస్పీ విశ్వ ప్రసాద్, ఆధ్వర్యంలో, వాహన తనిఖీలు చేపట్టారు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను 13ద్విచక్ర వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంబర్ ప్లేట్లు లేని వాహనాలను వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. హెల్మెంట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై , చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు వాహనాలు అమ్మి నట్లయితే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవలేను, లేదంటే వారిపై ఏదైనా జరిగితే బండి యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందని డిఎస్పీ విశ్వప్రసాద్ తెలియ జేశారు ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించాలి అందరు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని తెలిపారు వీరి వెంట ఎల్లారెడ్డిపెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొలని మొగిలి , గంభీరావుపేట ఎస్ ఐమహేష్ , ఎల్లారెడ్డిపెట్ ఎస్ ఐ శేఖర్ ,.పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
