ప్రాంతీయం

డెంగ్యూతో జిల్లాలో గర్భిణీ మృతి 

235 Views

ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 26

 

వైద్య అధికారుల నిర్లక్ష్యం గ్రామాలలో పరిశుద్ధ పనుల లోపం వల్ల డెంగు జ్వరంతో మూడు నెలల గర్భిణీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన జక్కం పావనికి మూడు రోజు లుగా జ్వరం వస్తుండడంతో భద్రాచలంలో ఓ ప్రైవేట్ హాస్పి టల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదు హాస్పిటల్కు తీసుకు వెళ్ళమని చెప్పగా వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులో గల మలక్పేట యశోద హాస్పిటల్కి తీసుకువె ళ్లి వైద్యం చేయిస్తుండగా మృతి చెందినట్లు మృతి చెందిన పావ నికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది మృతి చెంది న పావని మూడు నెలల గర్భి ణీతో ఉందని కుటుంబం సభ్యు లు తెలిపారు.ప్రస్తుతం వస్తున్న ఈ యొక్క విష జ్వరాలు కలు షిత వాతావరణం దోమల వల్ల నే ఇటువంటి పరిస్థితి ఏర్పడిం దని కుటుంబ సభ్యులు వివరిం చారు.కానీ కుటుంబం బిడ్డను కోల్పోయి శోకసంద్రంతో విలపి స్తూ ఉండడంతో చూస్తున్న ప్రజ లతో సహా కన్నీటి పర్యంతమ య్యారు.

Oplus_131072
Oplus_131072
Janapatla Jayaraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *