గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తో ఒప్పందం… తెలంగాణ ప్రభుత్వం కిశోర బాలికలకు మహిళలకు ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలను చేపట్టింది దాన్లో భాగంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాలలో అనేక వసతులను సౌకర్యాలను కల్పిస్తున్నది దాన్లో భాగంగా గ్రామీణ ప్రాంతం నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినిలు ఆధునిక ప్రపంచంతో పోటీపడేలాగా జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించింది జిల్లా యంత్రాంగం మంత్రి తారక రామారావు ఆదేశాలతో జిల్లాలో చదువుతున్న బాలికలు అందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థ సామాజిక శాస్త్రాలలో రారాణి అయిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ముంబై వారి సహకారంతో ఒప్పందానికి రావడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలకు సైన్స్ పాఠాలు, టెక్నాలజీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మొదలైన సబ్జెక్టులలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేక ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దీనిలో భాగంగా లింగ వివక్ష అంతమందించడానికి లింగ సమానత్వము సాధికారికత సాధించడం కోసం యవ్వన దశ నుంచే ఏర్పాట్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆధునిక పోటీ ప్రపంచంలో పిల్లలకి కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల్లో నూతన ఓరవడితో ఈ లాబోరేటరీలు స్థాపించబడుతున్నాయి.
దీనికి నిష్ణాతులైన ప్రొఫెసర్లు విద్యావేత్తలు మేధావుల సూచనలతో టాటా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై వారు అన్ని విధాలుగా ప్రణాళిక బద్ధంగా రూపొందించిన సిలబస్ ను అందిస్తున్నారు.