రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అంగన్వాడి టీచర్స్ చేస్తున్న సమ్మెకు బీసీ విద్యార్థి సంఘం పూర్తిగా మద్దతు సంఘీభావం బుధవారం తెలిపింది.
రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అనంతరం మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వారికి రెగ్యులర్ చేయాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.
వారి ఉద్యమంలో బీసీ విద్యార్థి సంఘం భాగ్య స్వాములు అవుతామని వారు చేపట్టే ఏ కార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గౌరు రాకేష్ ముదిరాజ్ మరియు కందుకూరి రమేష్ రాజు దినేష్ తదితరులు పాల్గొన్నారు