ఒకే రోజులో…..8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేష్ పర్యవేక్షణలో డాక్టర్ అనిల్, డాక్టర్ శశికాంత్ బృందం మోకాలి మార్పిడి చికిత్స లు ఆగస్ట్ 29 న నిర్వహించింది. రోగులు వేగంగా కోలుకుంటున్నారు.ఒక్కో మోకాలి మార్పిడి చికిత్స కు ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకుంటే రూ.లక్ష 50 వేల రూపాయలు మొత్తంగా రూ.12 లక్షల ఖర్చు అవుతుంది.ఆ మొత్తాన్ని భరించలేక బాధను దిగిమింగుతూ పేద ప్రజలు ఇంతకాలం జీవనం సాగించారు.వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్న సమాచారం వారికి చేరడంతో ఆసుపత్రికి వైద్యులను ప్రదించగా విజయవంతంగా ఆపరేషన్ లు పూర్తి చేశారు.
