దౌల్తాబాద్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ చిత్తారి గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషోర్, ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు…
