…మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ చేశారు
…నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు మర్కుక్ మండల కేంద్రంలోని ఐఓసీ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాన్ని నిర్ణిత గడువు లోపు అందించాలని నిర్మాణ ఏజెన్సీకి తెలిపారు. మ్యాప్ ను చూస్తూ కొన్ని సూచనలు చేశారు. కార్యాలయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అందరికీ సరిపడే విధంగా గదులు నిర్మించాలన్నారు. వేగంగా పనులు పూర్తి చేయాలని ఏజెన్సీకి తెలియజేశారు అనంతరం కుకునూరు పల్లి మండలంలోని లకుడారం గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ శిబిరానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ తెలియజేశారు. మెడికల్ అధికారి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పరీక్షలు జరిపి రీడింగ్ లేదా ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందించాలన్నారు. ఇప్పటివరకు అందించిన ప్రిస్క్రిప్షన్ అద్దాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ సిబ్బందికి భోజన వసతి కల్పించాలని సర్పంచ్ కి తెలిపారు కలెక్టర్ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, డిప్యూటీ డిహెచ్ఓ, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
