4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ చైర్మన్ ప్రతాప్రెడ్డి చెప్పారు.
ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు.
అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఖాతాదారులకు కల్పిస్తున్నామని ఆయన అన్నారు..
