మంచిర్యాల జిల్లా.
చలో పూణే భీమ్ కొరేగావ్ మహోత్సవాలను జయప్రదం చేయండి.
పిలుపునిచ్చిన ఆర్పిఐ ( ఐ )పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ చంద్ర.
జనవరి 1 2025 న మహారాష్ట్ర లోని పూనే భీమ్ కోరేగావ్ మహోత్సవాలను జయప్రదం చేయండి అని ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమేష్ చంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు మంచిర్యాలలో జరిగిన ఆర్పిఐ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతిఏటా జరుపుకునే ఈ యొక్క మహోత్సవలకు అంబేద్కర్ వాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
