మంచిర్యాల జిల్లా.
బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయాన్సీ రన్నర్ గా నిలిచినట్లుగా మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పూల్లూరి సుధాకర్ తెలియజేశారు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్ తో హోరాహోరీగా తలపడి రన్నర్ గా నిలిచింది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీయాన్సీని ఆయన అభినందించారు.
