ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 18
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పెద్ద బోయిని మైత్రి కి 60000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,మాజీ మండల యూత్ ప్రెసిడెంట్ కరుణాకర్, జుట్టు సుధాకర్,మ్యాకల శ్రీనివాస్,మల్లేష్,స్వామయ్య తదితరులు పాల్గొన్నారు.
