దౌల్తాబాద్: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజ స్వామి అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన పడిగే రాజవ్వకు రూ. 40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకింది మంజూర్, బ్రహ్మానంద రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య, యాదగిరి, కరుణాకర్, అశోక్, రాజు, నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…
