*హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దు: తలసాని..!*
హైదరాబాద్:సెప్టెంబర్ 03
హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దని కోరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ ఆదివారం తెల్లవారు జాము నుండి ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.
ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని కోరారు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
కాగా ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సోమవారం మంగళవారం ఇలా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
