దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 15వేలు, నిత్యాసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు చెలిమి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, సభ్యులు కిరణ్ కుమార్, ఆనంద్, గుంటుకు శ్రీనివాస్, ఆంజనేయులు, రమేష్, ఇబ్రహీం, శ్రీనివాస్, బాల కుమార్, ఆంజనేయులు గౌడ్, బాబు తదితరులు పాల్గొన్నారు….
