*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం*
తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రత్యేక బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. వరద ప్రభావాన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాలా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీలో అగ్రికల్చర్, ఫైనాన్స్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.
