ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత చేస్తూ గ్రామాలకు అవార్డులు తీసుకొస్తున్నారని అన్నారు. ఆనాడు కరోనా టైంలో కార్మికులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పరిశుభ్రత ధ్యేయంగా మలుచుకున్నారని గుర్తుచేశారు. బాడర్లో సిపాయి-ఊర్లో సఫాయి వీళ్లే లేకపోతే ప్రజలు లేరు గ్రామాలలో పరిశుభ్రత లోపిస్తుందని వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నావఘని అన్నారు. వారి జీతాలు 19000 పెంచాలని వారికి ఉద్యోగ భద్రత అందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు రుద్రవీణ, సుజిత్ కుమార్, నాయకులు అనిల్ , రాము తదితరులు పాల్గొన్నారు.
119 Viewsవిశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ వంబర్ 08 పెద్ద పల్లి జిల్లా ఏలిగేడు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు విశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నవంబర్ 11 న ఛలో హైదరాబాద్ లో జరుగు మాదిగ ఉప కులాల విశ్వ రూప మహాసభకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు గ్రామాల్లోని […]
123 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణరాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల బిజెపిపార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గతతొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ నష్టపోయిన రైతులకు ఆర్థికసహాయం అందించలేదు రైతురుణమాఫీ చేయలేదు అదే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడిన వందరోజుల తర్వాత ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు […]
481 Views-ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. దౌల్తాబాద్: ప్రజలందరూ డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సవాలతో జరుపుకోవాలని,వినోదం విషాదంగా మారకుండా వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని,మద్యం సేవించి అతివేగంగా జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ, తోటి ప్రయాణికులకు […]