ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, ముస్తాబాద్ మండల ఎంపిడిఓ రమాదేవి పారిశుద్ధ్య కార్మికులఫై అనుచిత వాక్యలను తీవ్రంగా కండిస్తూ జిల్లాసిఐటీయు, సిపిఎం నాయకులు ప్రధాన రహదారిఫై సుమారు 3 గంటలపాటు బయటాంచి ధర్నా రాస్తారోకో చేసారు. ఎంపిడిఓను వెంటనే సస్పెండు చేయాలనీ నినాదాలతో మండల కేంద్రం ఒక్కసారిగా హోరెత్తించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ….. స్థానిక ఎంపీడీవో రమాదేవి సపాకార్మికులు రాత్రినక పగలు అనక ఆడ మగ తేడా లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ వారిని గుర్తించాల్సింది పోయి నోటికి వచ్చినట్లు మీరు చేసే పనికి ఈ జీతం మీకు ఎక్కువ అని చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సఫాయి కార్మికులు అంటే ఇంత చిన్నచూపు మీకు ఎందుకని ఎంపీడీవోను ఈసందర్భంగా ప్రశ్నించారు. స్థానిక మంత్రి కేటీఆర్ 13 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షను తెలిసికూడా తెలియనట్టుగా వ్యవహరించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం అయ్యారు. ఇదిలా ఉండగా సఫాయి కార్మికుల సమస్యలకు నిరాహార దీక్ష చేస్తున్న దీక్షపై స్థానిక పోలీస్ సిబ్బంది రాత్రి అరెస్టు చేయడం తీవ్ర బాధాకరమని అన్నారు. గ్రామంలో సఫాయి బార్డర్ లో సిఫాయి ఇద్దరు ఒకటేనని ప్రత్యేకంగా సిఐటియు అన్నల్దాస్ గణేష్ మాట్లాడుతూ మండల ఎంపీడీవో నేడే తెలిసిన విషయం ఏమిటటే మాదళిత మహిళ అయి ఉండి అంబేద్కర్ లేనిది మీకు ఆ ఉద్యోగం లావచ్చేదని గుర్తుచేశారు. వెంటనే స్థానిక మంత్రి స్పందించి ఎంపీడీవో చేసిన వాక్యలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో జిపి సిఐటియు మండల అధ్యక్షులు జెల్లీలక్ష్మణ్, సిపిఎం పార్టీకార్యదర్శి మూసం రమేష్, సిఐటియు కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రరాకేష్, వివిద మండలాల హోదాలను కలిగిన జిపి నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
31 Viewsనువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా హెచ్ఎంఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బండారి క్రాంతి కిరణ్. మనస్థాపానికి గురైన ఫోర్ మెన్ రామ్. నేను లీడర్ ను నేను చెప్పేది వినాలి. నేను చెప్పింది చేయాలి లేకుంటే నువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా అంటూ డ్యూటీ టైం లో తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఫోర్ మెన్ రాము ని అవమానించిన ఘటన […]
129 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 18 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామం లో వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ ప్రెసిడెంట్ చిన్రాజ్ పండరి, రోటరీ క్లబ్ నెంబర్ పైత్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు, పెద్ద నరసింహారెడ్డి, పైదర వెంకటరెడ్డి, పైతర ప్రశాంత్ రెడ్డి, జుర్రు రాజు, చాకలి కృష్ణ, […]
73 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,బేతి మధుసూదన్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మంగి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బేతి మధుసూదన్ రెడ్డి,మండల మాజీ యూత్ ప్రెసిడెంట్ కరుణాకర్,మేకల శ్రీనివాస్,బాలస్వామి, బాయికాడి వెంకటేష్,తడెం బాబు,సాయికుమార్,నర్సింలు తో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది […]