Breaking News

ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కార్యక్రమం లో భాగం గా పాలేరు నియోజకవర్గం

105 Views

*ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కార్యక్రమం లో భాగం గా పాలేరు నియోజకవర్గం

ఖమ్మం రూరల్ మండలం గుర్రాల పాడు గ్రామం లో ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాన్ని అందించి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు*

ఆగస్టు 27 2023

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మరియు కేంద్ర మాజీమంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారి అదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు పాలేరు నియోజకవర్గం వ్యాపితం గా ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఇందులో భాగం గా ఈ రోజు అనగా ఆగస్టు 27 2023 న ఖమ్మం రూరల్ మండలం గుర్రాల పాడు గ్రామం లో నిర్వహించిన కార్యక్రమం లో శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు ఇంటింటికి కి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తో రూపందించిన కరపత్రాన్ని అందించి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి తీసుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమం లో ఖమ్మం రూరల్ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి కర్లపూడి భద్రకాలి, పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బెల్లి శ్రీశైలం యాదవ్ దుంపల పుల్లయ్య, ఉండేటి లక్ష్మి, దుంపల గిరిబాబు, దుంపల గోపి బొడ్డు ఉప్పమ్మా కూసుమంచి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండారిపల్లి శ్రీనివాసరావు, కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు తోడేటి వీరన్న, కూసుమంచి మండల sc సెల్ నాయకుడు ఊళ్ళోజు తిరమలేష్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *