దౌల్తాబాద్: తల్లిపాలు అమృతంతో సమానమని అంగన్వాడి టీచర్ రజిత అన్నారు. సోమవారం మండల పరిధిలోని గువ్వలేగి అంగన్వాడి సెంటర్లో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధ తదితరులు పాల్గొన్నారు…..
