368 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]
Breaking News
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి..
215 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని సెక్రటేరియట్ లో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సిరిసిల్ల నాయకులతో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు . కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ కుశ రవీందర్ షేక్ సాహెబ్ సూర దేవరాజ్ వంగ గిరిధర్ రెడ్డి కరికె శ్రీనివాస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రయాణికుల ఆందోళన !
291 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు గంటలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని వారు ఆరోపణ చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు […]
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు.
244 Viewsసిద్దిపేట్ డిసెంబర్ 17: జిల్లా రైతుల ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలి. మిడ్ మానేరు నుండి 1.50 టీ ఎం సి నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు నీటిని ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కి లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే […]
గృహప్రవేశం శుభకార్యానికి చిహ్నం…. జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
980 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]
మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. ముష్కమ్ దత్త్తాద్రి గౌడ్ డ్
319 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]
చనిపోతే మోసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరని స్మశానానికి వెళ్లి చనిపోయిన ఓ తల్లి.
320 Viewsచాపాడు మండలం డిసెంబర్16:నేను చనిపోతే మోసే వాళ్లు ఎవరూ లేరని బాధతో స్మశానం దగ్గరే చనిపోయిన తల్లి. మోసే నలుగురు లేరు అందుకే స్మశానానికి దగ్గరనే పడుకున్నా తల్లి బాధ చూస్తే బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. చాపాడు మండలం సోమాపురం పంచాయతీ ఆనందాశ్రమం గ్రామంలొ వడ్ల విజయలక్ష్మి (40) గత రెండున్నర సంవత్సరం గా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు చనిపోయింది. చుట్టుపక్కల వారు నేస్తం సేవా సంస్థ సభ్యులకు సమాచారం అందించడంతో […]
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు.
455 Views(మానకొండూర్ డిసెంబర్ 16) మానకొండూర్ మండలంలోని వాటర్ ట్యాంకు సమీపంలో కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై టూ వీలర్ పై కరీంనగర్ వైపు వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గంగిపల్లి గ్రామానికి చెందిన ములుకల సుధాకర్ (55) అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా,108 వాహనంలో పోలీస్ లు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని మానకొండూర్ సీఐ రాజకుమార్ […]
ఘోర రోడ్డు ప్రమాదం…
333 Views(శంకరపట్నం డిసెంబర్ 16) శంకరపట్నం మండలం తాడికల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున కారును డీ కొన్న లారీ,కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి,మరో ఇద్దరికి తీవ్ర గాయలు. జెసిబి సహాయంతో మృత దేహాలను బయటకు తీసిన పోలీసులు,ఇద్దరి మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. గాయపడిన వ్యక్తులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.. మృతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామస్తులుగా […]










