5 Viewsఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు కేటాయించి మూడు బస్సులను ఏర్పాటు చేసిన ఎంపి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు మంజూరు చేసి మూడు బస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. గతంలో మెడికల్ కాలేజీని సందర్శించిన సమయంలో […]
చెన్నూరు మున్సిపాలిటీ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
12 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు మున్సిపాలిటీ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని 10వ వార్డు లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ అధికారులు. వార్డుల్లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు.
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్
26 Viewsకలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్. మంచిర్యాల జిల్లా. నేడు తెలంగాణ జాగృతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత తో కాలినడకతో కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనానికి, వెంకటేశ్వర నామ స్మరణతో తిరుమల కొండ ఎక్కుతూన్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చెన్నూరులో స్పెషలిస్ట్ వైద్యులు తో వైద్య శిబిరం
10 Viewsప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చెన్నూరులో స్పెషలిస్ట్ వైద్యులు తో వైద్య శిబిరం. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చెన్నూరు మండలంలోని అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యులు తో వైద్య శిబిరం ను నిర్వహించడం జరిగినది. ఈ శిబిరమును స్థానిక సర్పంచ్ రాజమణి ఉప సర్పంచ్ వసంత్ శ్యాంసుందర్ మరియు ముఖ్యఅతిథిగా […]
భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి..
26 Viewsభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి.. సిద్దిపేట జిల్లా, మార్చి 6, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు డేగల హరీష్, ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలోసీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి,పాల్గొని కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో డేగల నర్సింలు,ఉపాధ్యక్షుడు మలేష్,సుధాకర్ గౌడ్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ లక్ష్మణ్ .డేగలస్వామి,యాదగిరి,శేఖర్,కనకయ్య,నర్సింలు ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
నాచారం గ్రామంలో యధావిధి స్థానంలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పాలి. ప్రజాసంఘాల నాయకుల డిమాండ్.
9 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నాచారం గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యధావిధి స్థానంలోనే ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ స్థాపన కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లర్ను అర్ధరాత్రి సమయంలో తొలగించడాన్ని వారు ఖండించారు. గతంలో అంబేద్కర్ సంఘం నాయకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విగ్రహాన్ని అదే స్థలంలో తిరిగి నిర్మించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని […]
రాంసాగర్ లో యువత హోలీ సంబరాలు.
86 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం హోలీ పండుగను గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా బుధవారం ఉదయం నుంచే చిన్నా–పెద్దా తేడా లేకుండా రంగుల కేళి నిర్వహించారు. గ్రామ వీధుల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. మండలంలోని రాంసాగర్ గ్రామంలో యువత సంప్రదాయాలకు అనుగుణంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువతతో పాటు పెద్దలు పాల్గొని పండుగను ఆనందంగా […]
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.
31 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని చిన్న మసాన్ పల్లి బస్టాండ్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన గంగోల్ల కుంటయ్య (55), మహమ్మద్ ఖాజా (40) ద్విచక్ర వాహనంపై గజ్వేల్కు వెళ్తుండగా, ఎదురుగా కొత్తపల్లి గ్రామానికి చెందిన చుంచునకోట శ్రీకాంత్ రాయపోల్ వైపు వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు వెంటనే సంఘటన […]
కోనాపూర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు త్వరలోనే. జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ
36 Viewsదౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి కలిసి కోనాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి […]
మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం
19 Viewsమంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లాలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యాధికారులు బస్తీధవకానాలు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల వైద్యులు జిల్లా వైద్య […]










