ప్రాంతీయం

సీఎం కేసీఆర్ ప్రధాని కావాలంటూ ప్రత్యేక పూజలు సర్వమత సంతోషమే సీఎం కేసీఆర్ ద్యేయం…

156 Views


తొగుట: కుల, మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని…మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మండలంలోని తొగుట-రాంపూర్ లోని శ్రీ మదనానంద శారదా క్షేత్రం లో సీఎం కేసీఆర్ ఆయుఆరోగ్యాలతో కల కాలం చల్లగా ఉండాలని , ప్రధాని కావాలంటూ..ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తొగుట కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి..కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని మతాల వారికి ప్రాధాన్యత ఇస్తూ..మత సామరస్యం కోసం కృషి చేస్తున్నారన్నారు.. ..భవిష్యత్ లో సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్ దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, కో అప్షన్ సభ్యులు md కాలీమోద్దీన్, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, కొమ్ము శరత్, సర్పంచ్ లు బొడ్డు నర్సింలు, మల్లయ్య, నాయకులు చిలువేరి రాంరెడ్డి, కుంభాల శ్రీనివాస్, చిలువేరి మల్లారెడ్డి, సుతారి రమేష్, కుంభం రఘోత్తంరెడ్డి,, ఎం చంద్రారెడ్డి, శ్రీశైలం, బక్క కనకయ్య, మాష్ఠి కనకయ్య, మంగ నర్సింలు, ఐలయ్య, సురేష్ గౌడ్, రమేష్, , బాలరాజు, మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి, షేక్ అభీద్, సంతోష్, అరుణ్, అనిల్, వికాస్, రమేష్, లక్ష్మారెడ్డి, రమేష్, ప్రశాంత్, బాలరాజు,కర్ణాకర్, స్వామి, రాజు, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *