జగదేవపూర్: మండల పరిధిలోని తిగుల్ గ్రామానికి చెందిన చింత లక్ష్మయ్య అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి
ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఆ కుటుంబానికి 3,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట చింత సత్యనారాయణ. రమేష్, చింత బాల్ నర్సయ్య. చౌదరి. కరుణాకర్.గణేష్ తదితరులు ఉన్నారు.
