అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు ఒక ఒక ట్రాలీ పట్టుకున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ సమాచారం మేరకు పట్టుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై వెంకటాపూర్ గ్రామ శివారులో, సిబ్బంది పాటుగా పెట్రోలింగ్ చేస్తుండగా, గ్రామ శివారులోకి వెళ్ళగా 03 ఇసుక ట్రాక్టర్లు (1) B.No.TS-23-T-6533, ట్రాలీ TS.23.T6534, (2)B.No.TS.23.T.5682. ట్రాలీ TS.23.T.5681, (3) TS.23.T.2854, ట్రాలీ TS.23.T.2855, గల ట్రాక్టర్లు పోలీస్ వాహనానికి ఎదురుగా, వాటిని ఆపి తనిఖీ చేయగా దాని డ్రైవరు మరియు ఓనర్లు అయిన,1) మేడిశెట్టి ప్రభాకర్, తండ్రి శివరాజం, 2) మామిళ్ల శ్రీనివాస్, తండ్రి నర్సయ్య,3) సమ్మెట నరేష్ ,తండ్రి మల్లయ్య, విరి యొక్క గ్రామం వెంకటాపూర్, అను వారి వద్ద ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ పేపర్స్ లేనందున, అట్టి ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి పిఎస్ కు తీసుకువచ్చి డ్రైవర్ ఓనరు అయినా పై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లుగా ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపినారు అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్లను నడిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.




