Breaking News విద్య

నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

108 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వహించారు విద్యార్థులు మానసికంగా ఒత్తిడి కావద్దని ఇంటర్ బోర్డు సూచనలు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహింపబడతాయని మీడియాతోచెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుండి మార్చి 19 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు. ఏ సమయంలోనైనా జిల్లా కలెక్టర్ లేదా డీఈఓ ఇన్విజిలేషన్కు రావచ్చని విలేకరులతో చెప్పారు మొత్తం 540 మంది ఎల్లారెడ్డిపేట మండలంలో హాజరుకానున్నారు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమరులో ఉంటుందని అన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7