మల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) గ్రామ శివారులో సిరిసిల్ల పట్టణానికి చెందిన చేరేళ్ళ సాయి(26) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లలో మెడికల్ ఏజెన్సీ కలెక్షన్ బాయ్ గా జీవనం కొనసాగిస్తుండేవాడు. జగిత్యాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి జీవితం పై విరక్తి చెంది కొండగట్టులో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ2 కుమారస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



