దౌల్తాబాద్: స్వామి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు స్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. శనివారం అంత్యక్రియలు నిర్వహించగా శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, నాయకులు దశరథ్ రెడ్డి, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు….




