దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో అబ్రమైన అరవింద్ 96.8 మార్కులు, బైపిసి విభాగంలో కారింగుల వర్ష 98.5 మార్కులు సాధించడంతో ఎంపికయ్యారని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసంలో ప్రతి సంవత్సరం రూ. 10 వేలు స్కాలర్ షిప్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కొరకు వినియోగించుకోవాలని కోరారు….




