- *బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
*
ది సిద్దిపేట టైమ్స్ రాయపోల్:
రాయపోల్.మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. వారంతా దుబ్బాక లో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో చందు, మహేష్ గౌడ్, యాదగిరి, వేణు, కృష్ణ, సంతు, పరశురాములు, రవి కుమార్, జీవన్, రవి, గణేష్, శ్రీకాంత్, దాసు, కనకరాజు, చందు లు బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు పార్టీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు. సుమారు 20 మంది కార్యకర్తలు బిజెపి లో చేరారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు బిజెపి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల నాయకులు రాజా గౌడ్ నిర్వహించారు.




