వర్గల్ మండల్ నెమటూర్ గ్రామంలో నెంటూర్ గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియునది ఏమనగా ఈ రోజు మా అమ్మ కీ. శే లు శ్రీమతి శ్రీ గౌరయ్య లక్ష్మీ సత్యనారాయణ గౌడ్ పరమపదించి ఈ రోజుతో మొదటి సంవత్సరికం అవుతుంది. ఇందుమూలంగా పోయిన వారి మధురస్మృతులను. వారితో గడిపిన క్షణాలను ‘బలగం ‘సినిమా ప్రదర్శనద్వారా అవకాశం వచ్చింది. తెలంగాణ సంప్రదాయా లు, బంధుత్వాలు. చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మ కాండలు చాలా చక్కగా ‘బలగం ‘సినిమా లో చూపించారు.ఈ సందర్బంగా మా అమ్మ
వర్ధంతి అయిన ఈ రోజు కలిసిరావడం గర్వపడుతున్నాను.. కావునా మీరందరూ అసౌకర్యంగా భావించకుండా, అన్యదా భావించకుండా ఈ సాయంత్రం 7-30 గంటలకు మన ఊరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద’బలగం ‘సినిమా ప్రదర్శించుటకు నిర్ణయించుకుంటిమి, మీరందరూ ఇదే నా ఆహ్వానం గా భావించి ఖచ్చితంగా వస్తారని భావిస్తున్నాను
ఇట్లు
శ్రేయోభిలాషి
గౌరయ్యగారి శ్యామలసాదుల్ల గౌడ్
ఎంపీటీసీ నెంటూర్




