ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల గిరిజన గురుకుల, బి.సి గురుకుల,జనరల్ గురుకుల విద్యాలయలో(ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్) 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ముస్తాబద్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రవేశమునకై తేదీ 23/04/2023 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రవేశ పరీక్షా నిర్వహించబడును అని విద్యార్థులు నాలుగవ తరగతిలో ఉతీర్ణత అయి ఉండాలని ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు తేదీ 06/03/2023 లోగా ఆన్ లైన్ లో రు.100/చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.
ఈ
ధరఖాస్తు ఒక సెల్ ఫోన్ నంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే అప్లై చేసుకునేందుకు వీలుంటుంది. అని కూడా తెలియజేశారు.




