*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ,బీజేపీ పార్టీ లను ఓడించి, బీఎస్పీ అభ్యర్థులను గెలిపించండి*
*మంచిర్యాల లోదొరల రాజ్యం పోవాలి బహుజన రాజ్యం రావాలి*
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం
శ్రీరామ్ పూర్ :- మంచిర్యాల గడ్డ మీద దొరల రాజ్యం ని ఓడించి బహుజన రాజ్యం సాధించాలని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4,5 డివిజన్ లలో కాదసి భాగ్యలక్ష్మి, శెట్టి ప్రవళిక ల తరుపున ఎన్నికల ప్రచార ర్యాలీ లో పాల్గొని అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మంచిర్యాల లో దొరల పాలన వల్లనే బహుజనుల బ్రతుకులు మారలేవున్నారు. మనకు మంచి బంగారు బవిష్యత్ ఉండాలంటే, రాజ్యాంగం రక్షించబడాలి అంటే బీఎస్పీ కి ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని ఆయన కోరారు. ఈ ప్రచార సభ లో జోన్ ఇంచార్జ్ కాదసి రవీందర్ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాను జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.





