జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఏడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా సోమవారం టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఐఏఎస్ నివాసంలో పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు
