
జగదేవపూర్ ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా శుక్రవారం ఉదయం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఐఏఎస్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జనబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, స్థానిక బీఆర్ ఎస్ అధ్యక్షులు నాచారం డైరెక్టర్ నాగరాజు, మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




