ప్రాంతీయం

గజ్వేల్ లో 18అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని 25కిలోల అవాలతో అద్భుతంగా చిత్రించిన రామకోటి రామరాజు

322 Views

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 18అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను ఉపయోగించి 5రోజులు శ్రమించి కేసీఆర్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి గురువారం ఆవిష్కరించారు. కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గహిత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ చిత్రాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో చిత్రిస్తానన్నాడు. గత 5సార్లు చిత్రించానని, ఓడ్లతో ఒకసారి, బియ్యంతో ఒకసారి, సబ్బుబిళ్ల మీద, సునేరుతో ఒకసారి, 100కిలోల పసుపు బియ్యంతో ఒకసారి. ఇప్పుడు అవాలతో రూపాన్ని అద్భుతంగా చిత్రించానన్నాడు. అభిమానులు తిలకించి మంత్రముగ్దులయ్యారు. ఆ కళాకారునికి అభినందనలు తెలిపారు. రైతు బాంధవునిగా పెరు గాంచిన కేసీఆర్ రైతు పండించిన అవాలతో చిత్రించడం కొసమెరుపు. అభిమానుల సందర్శనార్థం మూడు రోజులపాటు ప్రగతి స్కూల్ లో ఉంచనున్నట్లు రామకోటి రామరాజు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

One Reply to “గజ్వేల్ లో 18అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని 25కిలోల అవాలతో అద్భుతంగా చిత్రించిన రామకోటి రామరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *