నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ


ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు,
సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయినా అంబటి బాలలక్ష్మి- బిక్షపతి దంపతుల తృతీయ పుత్రిక జ్యోత్స్న , శివరాత్రి ఎల్లయ్య -సుశీల మొదటి పుత్రిక రచన ల, అక్కపెల్లి గ్రామానికి చెందిన నిరుపేద నేదునూరి దేవయ్య నర్సవ్వ ల ద్వితీయ కూతురు శృతికి పెళ్లిలకు పుస్తె మట్టెలు అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామ సర్పంచ్ నిమ్మ లక్ష్మీ నారాయణ రెడ్డి,అక్కపెల్లి లో ఉపసర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి , బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి లు వార్డు సభ్యులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.




