
జగదేవపూర్ మండలం అలిరాజ్ పేట గ్రామంలో నీలారాణి సహాయ సస్య రక్షణ కేంద్రం హైదరాబాద్ వారిచే రైతు శిక్షణ కేంద్రంలో భాగంగా మొక్క జొన్న రైతులకు లింగాకార్షక బుట్టలు, ట్రై కో గ్రామా బదనికలు ఉచితంగా పంపిణి చేశారు. కత్తెర పురుగు నివారణ కోసం చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది పిదప మొక్క జొన్న పంట క్షేత్రాన్ని సందర్శించి లింగాకర్షక బుట్టలు, ట్రై కో గ్రామ బదనికలను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రంలో MAO వసంతరావు, AEO శరణ్య, సర్పంచ్ యం లక్ష్మి, యంపిటిసి రమ్యరవి, విలేజ్ కో ఆర్డినేటర్ సత్తిరెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు




