
కంటి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ కొరివి కృష్ణ స్వామి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు .
ధర్మారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కంటి వెలుగు రెండో విడతలో భాగంగా నేటి నుంచి ధర్మారం గ్రామంలో ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ కంటి వెలుగు శిబిరాలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పని చేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,మాదాసు శ్రీనివాస్ఎం,పీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, మండల నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరవుతారని తెలిపారు.




