Breaking News

లాటరీ పద్ధతి ద్వారా వైన్స్ టెండర్ ల ఎంపిక

252 Views

లాటరీ పద్దతి ద్వారా జిల్లాలో వైన్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 48 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఆబ్కారీ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు గౌడ కులస్థులకు 9, ఎస్సీలకు 5 రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. పారదర్శకంగా రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. జిల్లాలో గౌడకులస్థులకు 9 షాపులు, ఎస్సీలకు 5 షాపులు కేటాయించామన్నారు. ఎస్సీలు, గౌడ కులస్థులకు రిజర్వ్ చేసిన షాపుల ఎంపిక ప్రక్రియను లాటరీ ద్వారా 9 సైకిళ్లలో నిర్వహించామన్నారు. మొదటి 5 సైకిళ్లలో మొదట తీసిన నెంబర్ ఎస్సీలకు తరువాత తీసిన నెంబర్ గౌడ కులస్థులకు కేటాయిస్తూ, 6వ సైకిళ్ల నుంచి 9వ సైకిళ్ల వరకు మొత్తం గౌడ కులస్థులకు ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో మిగిలిన 34 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 30, 2023 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్ ఉంటుందని, ప్రతి షాపుకు రూ. 2 లక్షల నాన్ – రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ ఆయన. వైన్ షాపు కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ మొదలైన అంశాల షెడ్యుల్ ను అబ్కారీ శాఖ కమిషనర్/సంచాలకులు ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ శాఖ సంయుక్త కమీషనర్ కె.ఏ.బి. శాస్త్రీ, బీసీ సంక్షేమ అధికారి మోహన్ రెడ్డి, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి భాస్కర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7