ప్రాంతీయం

*ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిచిన బిసి విద్యార్థి సంఘం* *– కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…  

151 Views
     ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 29, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాల్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేసారు. రవి గౌడ్ మాట్లాడుతూ బిసి ఎస్సీఎస్టీ విద్యార్థులకు వసతి గృహాలను పక్క భవనాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచకపోవడం బాధాకరమని హాస్టల్ విద్యార్థులకి మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సహకారంతోనే రాష్ట్రం ఏర్పాటు  అయింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు రుద్రవేని సుజిత్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *