వర్గల్ మండలం వేలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష పై చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) సహకారంతో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన ఎస్ ఏ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, కో కన్వీనర్లు ఎలుకంటి సురేష్ ,బండారి మహేష్, బిజెపి వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కాగిత రాజు, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దిండి నాగరాజు గౌడ్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఉప్పరి శేఖర్, మండల బీజేవైఎం ఉపాధ్యక్షుడు మహేష్ యాదవ్, బీజేవైమ్ కార్య వర్గ సభ్యులు జగన్ మరియు మండల పదాధికారులు మండల సీనియర్ నాయకులు సాయి యాదవ్, జాలిగామ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.




